ఆహారం తిన్న వెంటనే ఏదో ఒక పండు తీసుకుంటే ఆరోగ్యానికి మంచిదని నిపుణులు చెబుతున్నారు. భోజనం చేశాక తీసుకునే కంటే ఉదయం బ్రేక్ఫాస్ట్ టైంలో తీసుకుంటే వాటిలోని పోషకాలను శరీరం సమర్థవంతంగా గ్రహిస్తుందని వివరిస్తున్నారు. ఒకవేళ భోజనం తర్వాత పండ్లు తీసుకుంటే ఇతర పదార్థాలతో అది కలిసిపోయి వాటిలోని సంపూర్ణ పోషకాలు శరీరానికి అందవని చెబుతున్నారు. బ్రేక్ఫాస్ట్, లంచ్ మధ్యలో.. అలాగే సాయంత్రం వేళ పండ్లు తినవచ్చని అంటున్నారు.