మధ్యప్రదేశ్లోని గ్వాలియర్లో తాజాగా షాకింగ్ ఘటన జరిగింది. బైక్పై ఇద్దరు వ్యక్తులు రోడ్డు దాటుతుండగా ఓ కారు వేగంగా దూసుకొచ్చింది. బైక్ను ఢీకొట్టడంతో దానిపై ప్రయాణిస్తున్న ఇద్దరు వ్యక్తులు ఎగిరి కింద పడ్డారు. బాధితులకు తీవ్ర గాయాలయ్యాయి. అయితే ప్రమాదం తర్వాత కారు డ్రైవర్ సంఘటనా స్థలం నుంచి పరారయ్యాడు. బాధితులను కొందరు వాహనదారులు ఆసుపత్రికి తరలించారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.