నటి, మోడల్ పూనమ్ పాండేపై కేసు నమోదైంది. పూనమ్ పాండే ఫిబ్రవరి 2న క్యాన్సర్తో చనిపోయిందని తప్పుడు వార్తలు పుట్టించింది ఆమె సోషల్ మీడియా అకౌంట్ నుంచే అని తెలిసింది. ఈ నేపథ్యంలో ముంబైకి చెందిన అడ్వకేట్ అలీ కాషిఫ్ ఫిర్యాదు మేరకు శనివారం ముంబైలో ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. అలాగే ఈ వార్తను ప్రచారం చేసినందుకు ఆమె మేనేజర్ నికితా శర్మపై సైతం కేసు నమోదైంది.