మహారాష్ట్రలో 12 ఏళ్ల కిందట కలకలం రేసిన షీనా బోరా హత్య కేసుపై సీబీఐ సంచలన స్టేట్మెంట్ ఇచ్చింది. అటవీ ప్రాంతం నుంచి సేకరించిన ఎముకలు, ఇతర అవశేషాల ప్యాకెట్లు మాయమైనట్లు ఇవాళ కోర్టుకు తెలిపింది. అవి ఎక్కడ ఉన్నాయో కనిపించడం లేదని చెప్పింది. రాయగఢ్ అటవీ ప్రాంతంలో పోలీసులు స్వాధీనం చేసుకున్న ఎముకలు, అవశేషాలు మనిషివేనని సర్ జేజే హాస్పిటల్ ఫోరెన్సిక్ నిపుణుడు డాక్టర్ జెబా ఖాన్ నిర్ధారించారు.