ఏపీ ల్యాండ్ టైట్లింగ్ యాక్టును రద్దు చేయడంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రవ్యాప్తంగా రైతులు, న్యాయవాదులు సంబరాలు చేసుకున్నారు. తిరుపతి, పల్నాడు, గన్నవరంలో రైతులు, న్యాయవాదులు చంద్రబాబుకు కృతజ్ఞతలు తెలిపారు. గన్నవరంలో రైతులు జగన్ సర్వే రాళ్లను ధ్వంసం చేసి, చంద్రబాబు చిత్రపటానికి పామాయిల్ గింజలతో అభిషేకం నిర్వహించారు. తిరుపతిలో న్యాయవాదులు, స్థానిక ఎమ్మెల్యే శ్రీనివాసులు మిఠాయిలు పంచి హర్షం వ్యక్తం చేశారు.