యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహ స్వామి దేవస్థానం కీలక నిర్ణయం తీసుకుంది. ప్రధాన ఆలయంలో విధులు నిర్వహించే సిబ్బంది సెల్ ఫోన్లు ఆలయంలోకి తీసుకెళ్లడాన్ని నిషేధిస్తూ దేవస్థానం నిర్ణయం తీసుకుంది. ఆలయంలో విధులు నిర్వర్తించేటప్పుడు సిబ్బంది ఎవరూ కూడా తమ సెల్ ఫోన్లు తీసుకుని వెళ్లకుండా చర్యలు తీసుకోవాలని దేవస్థానం అధికారులు ఆదేశాలు జారీచేశారు.