వ్యాపారులు ఓ పక్క ఎగుమతులు లేవని చెబుతూనే మరో పక్క రోజుకు లక్ష టిక్కీలు వచ్చినా కొనేస్తున్నారని, తాము పండించిన సరుకు అంతా ఎటుపోతోందని మిర్చి రైతులు ప్రశ్నిస్తున్నారు. పంటను ఇటు అమ్ముకోలేక.. అటు గిడ్డంగుల్లో దాచుకునే ఖాళీ లేక రైతులు దిగాలు పడిపోతున్నారు. తక్షణం క్వింటాల్కు రూ.15 వేలు తగ్గకుండా మార్కెట్ ఇంటర్వెన్షన్ పథకం కింద పంటను కొనాలని మిర్చి రైతులు కోరుతున్నారు.