కాంగ్రెస్లో వర్గపోరు ఉద్ధృతమైంది. జోగులాంబ గద్వాల్ జిల్లా అలంపూర్లో జరిగిన కార్యక్రమంలో గద్వాల్ ఇన్ఛార్జ్ సరిత అసంతృప్తి వ్యక్తం చేశారు. సీనియర్ నేత సంపత్ ప్రసంగాన్ని ఆమె వర్గం అడ్డుకుంది. ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి చేరిక సమయంలో ఇచ్చిన హామీ నెరవేరలేదని, కార్యకర్తలపై కేసులు, పోలీసుల నిర్లక్ష్యం తమను బాధిస్తున్నాయని సరిత ఆవేదన చెందారు. 15 నెలలు ఓపికపట్టామని, ఇంకెంతకాలం ఇలాగే ఉండాలని ప్రశ్నించారు.