జగ్జీవన్ రామ్ జయంతి సందర్భంగా ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు నివాళి అర్పించారు. దేశ స్వాతంత్య్ర ఉద్యమంలోనూ, స్వరాజ్యం వచ్చాక ఆధునిక భారత దేశ నిర్మాణంలోనూ స్ఫూర్తివంతమైన సేవలు అందించారని ట్విట్టర్ ఎక్స్లో ఆయన ట్వీట్ చేశారు. తన జీవితమంతా సమసమాజ స్థాపన కోసం కృషిచేసిన బాబూ జగ్జీవన్ రామ్ స్ఫూర్తిగా మనందరం బడుగువర్గాల అభ్యున్నతి కోసం కృషి చేద్దామని పిలుపునిచ్చారు.