గుజరాత్ సీఎం భూపేంద్ర పటేల్ రాష్ట్ర ఉద్యోగులకు శుభవార్త తెలిపారు. కరువు భత్యాన్ని రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు కరువు భత్యాన్ని 4 శాతం పెంచుతున్నట్లు ప్రకటించారు. జనవరి 1 నుంచి అమలులోకి వచ్చిన ఏడో వేతన సంఘం సిఫార్సుల మేరకు భత్యాన్ని పెంచనున్నారు. దీంతో 4.71 లక్షల మంది ప్రస్తుత, 4.73 లక్షల మంది పెన్షనర్లకు ప్రయోజనం కలుగనుంది.