హైడ్రా పేరుతో సీఎం రేవంత్‌రెడ్డి డ్రామాలు ఆడుతున్నారు: ఈటల రాజేందర్

61చూసినవారు
హైడ్రా పేరుతో రేవంత్‌రెడ్డి సర్కార్ డ్రామాలు ఆడుతోందని మల్కాజ్‌గిరి ఎంపీ ఈటల రాజేందర్ విమర్శలు చేశారు. చైతన్యపురి డివిజన్ న్యూ మారుతి నగర్ మూసీ పరిసర ప్రాంతాల్లో ఈటల రాజేందర్ శుక్రవారం పర్యటించి బాధితులకు అండగా ఉంటానని ధైర్యం చెప్పారు. ప్రజలకు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నారని మండిపడ్డారు. రేవంత్ మాటలు నమ్మినందుకు ప్రజలకు ప్రశాంతత లేకుండా చేస్తున్నారని ఎంపీ ఈటల రాజేందర్ ఆగ్రహం వ్యక్తం చేశారు.

సంబంధిత పోస్ట్