తెలంగాణ సీఎం రేవంత్రెడ్డి శనివారం ఆయన సొంత నియోజకవర్గం కొడంగల్లో పర్యటించనున్నారు. ఈ పర్యటనలో భాగంగా సీఎం కొడంగల్ వెంకటేశ్వరస్వామి బ్రహ్మోత్సవాల్లో పాల్గొంటారు. అనంతరం రంజాన్ సందర్భంగా తన నియోజకవర్గంలోని ముస్లిం సోదరులకు ఇవ్వనున్న ఇఫ్తార్ విందులో పాల్గొననున్నారు. నియోజకవర్గంలోని పలు అభివృద్ది కార్యక్రమాలకు శంకుస్థాపన చేయనున్నారు. అనంతరం బహిరంగసభలో పాల్గొనున్నట్లు కాంగ్రెస్ శ్రేణులు వెల్లడించాయి.