అఫ్గానిస్థాన్లో భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేల్పై 4.7 తీవ్రత నమోదైంది. శనివారం ఉ.5.16 గంటల సమయంలో భూకంపం సంభవించినట్లు నేషనల్ సెంటర్ ఫర్ సిస్మాలజీ తెలిపింది. కాగా, నిన్న మయన్మార్, థాయ్లాండ్లో 7.7 తీవ్రత భారీ భూకంపం సంభవించింది. దాదాపు 1000 మంది వరకు మృతి చెందినట్లు సమాచారం. భారీ భూకంపం వల్ల భవనాలు కుప్పకూలాయి. రహదారులు బీటలు వారాయి.