కేరళ తీరంలో ఆరుగురు భారతీయ సిబ్బందితో కూడిన ఇరాన్ మత్స్యకార నౌకను ఇండియన్ కోస్ట్ గార్డ్ (ఐసిజి) అదుపులోకి తీసుకున్నట్లు భారత రక్షణ మంత్రిత్వ శాఖ సోమవారం తెలిపింది. వారిని ఆదివారం అదుపులోకి తీసుకున్నట్లు పేర్కొన్నారు. పాస్పోర్ట్లను జప్తు చేశారని వారు చెప్పారని వెల్లడించింది. బోటు యజమాని ఇరాన్ దేశస్థుడని, ఆయన తమిళనాడుకు చెందిన మత్స్యకారులతో ఒప్పందం కుదుర్చుకున్నారని ప్రాథమిక విచారణలో తేలింది.