జమ్మూకాశ్మీర్లోని పూంచ్ సెక్టార్లో భారీ వర్షం, బలమైన ఈదురుగాలులు బీభత్సం సృష్టించాయి. ఈ క్రమంలో కలానీ-చక్తో గ్రామాల మధ్య స్థానిక నదిపై నిర్మించిన ఫుట్ బ్రిడ్జ్ శుక్రవారం కూలిపోయింది. దీంతో 2 గ్రామాల మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. అయితే ఫుట్ బ్రిడ్జ్ కూలిన సమయంలో దానిపై ఎవరూ లేకపోవడంతో ప్రాణాపాయం తప్పింది. దీనికి అధికారులు మరమ్మతులు చేపట్టారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.