చాట్జీపీటీ మాతృ సంస్థ ఓపెన్ఏఐ భారత్లో తన తొలి నియామకాన్ని చేపట్టింది. దేశంలో తన కార్యకలాపాలను విస్తృతం చేయాలనుకుంటున్న నేపథ్యంలో ప్రగ్యా మిశ్రాను ప్రభుత్వ సంబంధాల విభాగం అధిపతిగా నియమించింది. గతంలో ట్రూకాలర్లో ప్రభుత్వ సంబంధాల విభాగం అధిపతిగా మిశ్రా విధులు నిర్వర్తించారు. అంతకుముందు వాట్సప్లోనూ ఆమె పని చేశారు. భారత్లో ప్రస్తుతం ఎన్నికలు జరుగుతున్న తరుణంలో ఓపెన్ఏఐ ఈ నియామకం చేపట్టడం గమనార్హం.