విద్యుత్ కొనుగోళ్ల విషయంలో మాజీ సీఎం కేసీఆర్ రాసిన లేఖపై కమిషన్ చైర్మన్ జస్టిస్ నరసింహారెడ్డి స్పందించారు. ఆదివారం ఆయన మాట్లాడుతూ.. 'కేసీఆర్ లేఖపై నిపుణులతో చర్చిస్తా. పలు అంశాలను లేఖలో ప్రస్తావించారు. కొన్ని ప్రశ్నలకు సమాధానం ఇచ్చారు. ఆయన చెప్పిన వివరాలకు వాస్తవాలకు సరిపోల్చాల్సి ఉంది. వాస్తవాలపై బీహెచ్ఈఎల్ ప్రతినిధులను వివరాలు అడుగుతాం. కేసీఆర్ అభ్యంతరాలపై పునపరిశీలన చేస్తాం. లేఖపై ఎల్లుండి సమీక్ష నిర్వహిస్తాం' అని అన్నారు.