టీమిండియా హెడ్ కోచ్ వేటలో బీసీసీఐ బిజీగా ఉంది. కోచ్ పదవి కోసం మాజీ క్రికెటర్ గౌతమ్ గంభీర్, డబ్ల్యూవి రామన్ మధ్య తీవ్ర పోటీ నెలకొంది. రామన్కు మహిళల టీమ్కు కోచ్గా పనిచేసిన అనుభవం ఉంది. గంభీర్ టీమిండియా తరఫున ఆడారు. ఐపీఎల్లో కోల్ కతా నైట్ రైడర్స్ మెంటర్గా ఉన్నారు. 2024 ఐపీఎల్లో గంభీర్ చేసిన ప్రయోగాలు ఫలించాయి. కాగా.. వీరిద్దరికి మంగళవారం మొదటి రౌండ్ ఇంటర్వ్యూ జరిగింది. నేడు రెండో రౌండ్ జరగనుంది.