రామోజీరావుకు నివాళులర్పించిన వైఎస్‌ షర్మిల

74చూసినవారు
రామోజీరావుకు నివాళులర్పించిన వైఎస్‌ షర్మిల
రామోజీ గ్రూప్‌ సంస్థల ఛైర్మన్‌ రామోజీరావుకు ఏపీ కాంగ్రెస్‌ అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిల నివాళులర్పించారు. రామోజీ ఫిల్మ్‌సిటీలో ఆయన చిత్రపటం వద్ద అంజలి ఘటించారు. అనంతరం రామోజీరావు సతీమణి రమాదేవి, మార్గదర్శి ఎండీ శైలజా కిరణ్‌, రామోజీ ఫిల్మ్‌సిటీ ఎండీ విజయేశ్వరి సహా కుటుంబసభ్యులను పరామర్శించి.. తన ప్రగాఢ సానుభూతి తెలిపారు.

సంబంధిత పోస్ట్