TG: మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్రావుపై ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ స్పీకర్కు ఫిర్యాదు చేశారు. బుధవారం అసెంబ్లీలో హరీశ్ రావు ఫొటోలు తీశారని.. ఈ మేరకు హరీశ్ రావుపై ఫిర్యాదు చేశారు. కాగా నిన్న 'పదేళ్లు మంత్రిగా పనిచేసిన అనుభవం ఉన్న మీకు సభలో ఫొటోలు తీయడం నిబంధనలకు విరుద్ధమని తెలుసుకదా. వెంటనే ఆ ఫొటోలను డిలీట్ చేయండి' అని హరీశ్రావను స్పీకర్ గడ్డం ప్రసాద్ ఆదేశించారు.