కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ ఎన్నికల్లో ఇచ్చిన హామీల్లో భాగంగా వరి ధాన్యానికి బోనస్ చెల్లించాలని అడిగిన పాపానికి రైతులను కుక్కలతో పొలుస్తుందని మాజీ మంత్రి హరీష్ రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. గురువారం కొడిమ్యాల మండలం అప్పారావుపేట గ్రామంలో వరి కొనుగోలు కేంద్రాన్ని సందర్శించారు. రైతులను ఉద్దేశించి మాట్లాడుతూ.. అసెంబ్లీలో అన్ని రకాల వరి ధాన్యానికి బోనస్ ఇచ్చేదాకా రైతుల పక్షాన నిలబడి పోరాడుతామని అన్నారు.