కాంగ్రెస్ మంత్రి కాన్వాయ్ ఢీకొని ముగ్గురికి తీవ్రగాయాలు (వీడియో)

81చూసినవారు
తెలంగాణ మంత్రి శ్రీధ‌ర్ బాబు కాన్వాయ్‌లోని పైల‌ట్ వాహ‌నం ప్ర‌మాదానికి గురైంది. రోడ్డుపై వెళ్తున్న ముగ్గురు వ్య‌క్తుల‌ను పైల‌ట్ వాహ‌నం ఢీకొట్టింది. ఈ ప్ర‌మాదంలో 8 ఏళ్ల బాలుడికి రెండు కాళ్లు విరిగిపోయాయి. మ‌రో ఇద్దరికి తీవ్ర గాయాల‌య్యాయి. సిద్దిపేట జిల్లా వ‌ర్గ‌ల్ మండ‌లం గౌరారం గ్రామ శివారులో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ప్ర‌మాదం జ‌రిగిన త‌ర్వాత మంత్రి క‌నీసం ప‌రామ‌ర్శించ‌కుండా వెళ్లిపోయార‌ని బాధితులు ఆరోపించారు.

సంబంధిత పోస్ట్