తిరుమల కొండపై సోమవారం భక్తుల రద్దీ కొనసాగుతుంది. శ్రీవారి దర్శనం కోసం వైకుంఠ క్యూ కాంప్లెక్స్లోని 20 కంపార్ట్మెంట్లలో వేచి ఉన్నారు. స్వామివారి సర్వదర్శనానికి 12 గంటల సమయం పడుతుంది. ఇక ఆదివారం వెంకన్నను 85,935 మంది భక్తులు దర్శించుకోగా, 31,222 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. శ్రీవారి హుండీ రూ.4.21 కోట్లు సమకూరింది.