నియంతృత్వ పాలనలో దేశం: కేజ్రీవాల్

63చూసినవారు
నియంతృత్వ పాలనలో దేశం: కేజ్రీవాల్
దేశం నియంతృత్వ పాలనలో ఉందనడానికి కేంద్ర హోం మంత్రి అమిత్ షా వ్యాఖ్యలే నిదర్శనమని ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్) చీఫ్, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ఆరోపించారు. లోక్‌సభ ఎన్నికల తర్వాత పంజాబ్‌లోని భగవంత్ మాన్ ప్రభుత్వాన్ని కూల్చివేస్తామని అమిత్ షా బెదిరించారని పేర్కొన్నారు. సీబీఐతో ఎమ్మెల్యేలను బెదిరిస్తామని బీజేపీ నాయకులు బహిరంగంగా చెబుతున్నారని విమర్శించారు. 92 సీట్లున్న ఆప్ ప్రభుత్వాన్ని ఎలా పడగొడతారని ప్రశ్నించారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్