మయన్మార్, బ్యాంకాక్లో భూకంపం సంభవించడంతో అంతా అతలాకుతలం అయిన సంగతి తెలిసిందే. పలు చోట్ల ఎత్తైన భవనాలు, వంతెనలు నెలమట్టమయ్యాయి. శిథిలాల కింద చిక్కుకుని వేల సంఖ్యలో ప్రాణాలు కోల్పోయారు. మరణాల సంఖ్య క్రమంగా పెరుగుతూనే ఉంది. కాగా ఓ ఎత్తైన భవనం చివరి అంతస్తులో ఉన్న స్విమ్మింగ్ పూల్లో ఓ ప్రేమ జంట సేదతీరుతూ రొమాన్స్ చేస్తుండగా ఒక్కసారిగా భూమి కంపించడంతో ఊగిపోయింది. దీంతో వారు అక్కడి నుంచి పరుగులు పెట్టిన వీడియో వైరల్ అవుతోంది.