యూపీలో భారీ అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. సిద్ధార్థనగర్ జిల్లా దుమారియాగంజ్ తహసీల్ ప్రాంతంలోని ఓ గడ్డి తయారీ యంత్రంలో భారీగా మంటలు చెలరేగాయి. ఈ మంటల కారణంగా దాదాపు చుట్టుపక్కల ఉన్న పంటపొలాలు కాలిబూడిదయ్యాయి. అగ్నిమాపక సిబ్బందికి సమాచారం ఇచ్చిన.. ఫైరింజన్లు సమయానికి రాకపోవడంతో గ్రామస్తులు మంటలను ఆర్పివేశారు. ఘటనకు సంబంధించి పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.