అమెరికాలోని విదేశీ విద్యార్థులకు ఆ దేశ విదేశాంగశాఖ వార్నింగ్ మెయిల్స్ పంపినట్లు తెలుస్తోంది. తమ దేశాన్ని స్వచ్ఛందంగా విడిచిపోవాలని హెచ్చరించిందని, క్యాంపస్ ఆందోళనల్లో క్రియాశీలమైన వారికి మెయిల్స్ పంపుతున్నట్లు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ పోస్టులకు భారతీయ విద్యార్థులు కూడా స్పందించారు. కొందరికి ఇలాంటి మెయిల్స్ వచ్చే అవకాశం ఉంది. స్టూడెంట్ సోషల్ మీడియా ఖాతాలను విదేశాంగశాఖ జల్లెడ పడుతోంది.