మహారాష్ట్ర రాజధాని ముంబైలోని ఓ ఎలక్ట్రిక్ సప్లై అండ్ ట్రాన్స్పోర్ట్ (బెస్ట్) బస్సుపై కొన్ని కాకులు వాలాయి. ఆ బస్సు కదలడంతో దానిపైనే అవి ప్రయాణించాయి. ఒక యూజర్ ఈ వీడియో క్లిప్ను Xలో పోస్ట్ చేశాడు. దీంతో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. దీంతో నెటిజన్లు ఫన్నీగా స్పందించారు. కాకుల గుంపు ముంబై టూర్కు వెళ్తున్నాయా? అని పలువురు ప్రశ్నించారు.