భారత్‌లో 16 శాతం తగ్గిన ముడిచమురు చెల్లింపులు

50చూసినవారు
భారత్‌లో 16 శాతం తగ్గిన ముడిచమురు చెల్లింపులు
దిగుమతుల పరిమాణంలో పెద్దగా మార్పులేకపోయినప్పటికీ.. 2023-24లో భారతదేశ ముడి చమురు దిగుమతి చెల్లింపులు సగటున 16 శాతం తగ్గి, 132.4 బిలియన్‌ డాలర్లకు చేరుకుంది. రష్యా ముడి చమురు సరఫరాపై డిస్కౌంట్‌ ప్రకటించడంతో ఈ మేరకు తగ్గినట్లు పెట్రోలియం ప్లానింగ్‌ అండ్‌ అనాలసిస్‌ సెల్‌ ఇటీవలి సమాచారం తెలిపింది. గతేడాది ముడి చమురు దిగుమతి చెల్లింపులు 157.5 బిలియన్‌ డాలర్లుగా ఉన్నట్లు తెలిపింది.

సంబంధిత పోస్ట్