18 ఏళ్ల తర్వాత ఎంత వస్తుందంటే..?

70చూసినవారు
18 ఏళ్ల తర్వాత ఎంత వస్తుందంటే..?
ఎన్‌పీఎస్‌ వాత్సల్య పథకంలో చేరిన వారు 18 ఏళ్లు వచ్చాక పథకం నుంచి వైదొలగొచ్చు. అప్పటికి సమకూరిన మొత్తం రూ.2.5 లక్షల కంటే తక్కువ ఉంటే మొత్తం ఉపసంహరించుకోవచ్చు. అదే మొత్తం రూ.2.5 లక్షలు కంటే ఎక్కువ ఉంటే.. 80% యాన్యుటీ స్కీమ్‌లో పెట్టాల్సి ఉంటుంది. 20% విత్‌డ్రా చేసుకొనే సదుపాయం ఉంది. కావాలనుకుంటే 18 ఏళ్ల తర్వాత కూడా ఖాతాను కొనసాగించొచ్చు. 18 ఏళ్ల పూర్తయిన 3 నెలల్లోపే కేవైసీని పూర్తి చేయాల్సి ఉంటుంది. అప్పుడు సాధారణ టైప్‌-1 ఖాతాగా కొనసాగుతుంది.

సంబంధిత పోస్ట్