తండ్రిని రక్షించబోయి.. కూతురు మృతి

1070చూసినవారు
తండ్రిని రక్షించబోయి.. కూతురు మృతి
ములుగు జిల్లా మంగపేట మండలంలో విషాదం నెలకొంది. కమలాపురానికి చెందిన నిఖిత సమీపంలోని గోదావరి నది వద్దకు తండ్రితో వెళ్ళింది. అయితే తండ్రి సరదాగా స్నానం చేసేందుకు గోదావరిలో దిగాడు. లోతు ఎక్కువగా ఉండడంతో ఈతరాక మునిగిపోతుండగా ఒడ్డున ఉన్న కుమార్తె చేయి అందించి బయటకు లాగింది. ఇదే క్రమంలో బండమీద నుంచి ఆమె కాలుజారి గోదావరిలో పడి మునిగి మృతి చెందింది.

సంబంధిత పోస్ట్