తెలంగాణలో దారుణం జరిగింది. నల్లగొండ మున్సిపాలిటీ పరిధి పాతబస్తీ హిందూపూర్ వాటర్ ట్యాంక్లో మృతదేహం లభ్యమైంది. పది రోజులుగా ఆ ట్యాంక్ నీటిని ప్రజలు తాగారు. తాగునీరు దుర్వాసన రావడంతో వాటర్ సప్లై సిబ్బందికి 11వ వార్డు ప్రజలు ఫిర్యాదు చేయగా.. ట్యాంక్ని పరిశీలించారు. ట్యాంక్లో డెడ్బాడీని సిబ్బంది గుర్తించి.. మృతదేహాన్ని బయటకు తీశారు. మృతుడు హనుమాన్నగర్కు చెందిన ఆవుల వంశీగా గుర్తించారు. వంశీ కనిపించడం లేదని మే 24న పోలీసులకు బంధువులు ఫిర్యాదు చేశారు.