ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ కోర్టు వీడియోను సోషల్ మీడియా నుంచి తొలగించాలని ఆయన భార్య సునీతా కేజ్రీవాల్ను ఢిల్లీ హైకోర్టు ఆదేశించింది. అలాగే ఆమెతో సహా సోషల్ మీడియా సంస్థలకు నోటీసులు పంపింది. ఢిల్లీ మద్యం పాలసీ కేసులో కేజ్రీవాల్ను అరెస్ట్ చేసిన ఈడీ.. మార్చి 28న ఢిల్లీలోని రూస్ అవెన్యూ కోర్టులో హాజరుపరిచింది. అప్పుడు ప్రత్యేక న్యాయమూర్తి కావేరీ బవేజాను ఆయన వ్యక్తిగతంగా కలిసిన వీడియోలు నెట్టింట వైరల్ కాగా, సునీతా ఈ వీడియో క్లిప్ను రీట్వీట్ చేశారు.