అడుగంటిన భూగర్భ జలాలు.. ఎండిపోతున్న పంటపొలాలు

59చూసినవారు
అడుగంటిన భూగర్భ జలాలు.. ఎండిపోతున్న పంటపొలాలు
వేసవి ప్రారంభంలోనే ఎండలు మండుతున్నాయి. దీంతో రోజురోజుకు భూగర్భజలాలు అడుగంటి పంటపొలాలు ఎండుతున్నాయి. ఆయకట్టేతర మెట్ట భూములకు చెరువులు, బావులే ఆధారం. చెరువుల్లో నీరు లేక బావుల్లో నీరు అడుగంటి మెట్టప్రాంతాల్లో పంటలు ఎండుతున్నాయి. మెట్టప్రాంతాల్లో భూగర్భజలాలు అడుగంటి పోవడంతో రైతులు పంటలను కాపాడుకునేందుకు వ్యవసాయబావుల్లో పూడిక తీత, బోరుబావులను తవ్వడం వంటి వాటితో ఇబ్బందులు పడుతున్నారు.

సంబంధిత పోస్ట్