IPL-2025లో భాగంగా ఢిల్లీ క్యాపిటల్స్తో జరిగిన మ్యాచులో చెన్నై ఘోర పరాజయం పాలైంది. 184 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన చెన్నై బ్యాటర్లలో ఎవరూ రాణించకపోవడంతో 20 ఓవర్లకు 5 వికెట్లు కోల్పోయి 158 పరుగులు మాత్రమే చేసింది. దీంతో 25 పరుగుల తేడాతో ఓడిపోయి చెన్నై అభిమానులకు నిరాశ మిగిల్చింది. చెన్నై బ్యాటర్లలో విజయ్ శంకర్ (69*) ధోనీ (30*) పరుగులు చేశారు. ఢిల్లీ బౌలర్లలో విప్రాజ్ నిగమ్ 2 వికెట్లు తీశాడు.