తెలంగాణ ఆర్టీసీ కూడా రామభక్తుల సేవకు సిద్దమయ్యింది. భద్రాచలం ఆలయ అధికారులతో సమన్వయం చేసుకుంటూ సీతారాముల ముత్యాల తలంబ్రాల పంపిణీకి సిద్దమైంది. ఇందుకోసం ఆన్ లైన్ లేదా ఆఫ్లైన్లో ఆర్టీసీ అధికారులను సంప్రదించాల్సి ఉంటుంది. మీ దగ్గరలోని ఆర్టీసీ బస్టాండ్కు వెళ్లి టీజీఆర్టీసీ లాజిస్టిక్ కేంద్రంలో రూ.151 చెల్లించి మీ పేరు, ఇతర వివరాలు అందించాలి. సీతారాముల కల్యాణంలో ఉపయోగించే తలంబ్రాలను మీరు పేర్కొనే అడ్రస్కు పంపిస్తారు.