గుర్మీత్ రాం రహీం సింగ్ (డేరా బాబా)కు భారీ ఊరట లభించింది. ఓ మాజీ అధికారి హత్య కేసులో డేరాబాబాను నిర్దోషిగా హర్యానా కోర్టు మంగళవారం ప్రకటించింది. హర్యానాలోని సిర్సాలో ఉన్న డేరా సచ్చా సౌదా ఆశ్రమం మాజీ అధికారి రంజిత్ సింగ్ జులై 10, 2002న హత్యకు గురైన విషయం తెలిసిందే. ఈ హత్య కేసులో డేరా బాబాతోపాటు, మరో నలుగురిపై తానేసర్ పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. అయితే ఈ కేసులో ఇవాళ హైకోర్టు 21 ఏళ్ల సుదీర్ఘకాలం తర్వాత డేరాబాబా నిర్దోషి అని తేల్చి చెప్పింది.