పట్టాలు తప్పిన గూడ్స్ రైలు.. పలు రైళ్లు నిలిపివేత

61చూసినవారు
గుంటూరు-సికింద్రాబాద్ మార్గంలో నల్గొండ జిల్లా దామచర్ల మండలం విష్ణుపురం వద్ద గూడ్స్ రైలు పట్టాలు తప్పింది. దీంతో అధికారులు ఆ మార్గంలో వస్తున్న శబరి ఎక్స్‌ప్రెస్ రైలును మిర్యాలగూడలో నిలిపివేశారు. అలాగే జన్మభూమి ఎక్స్‌ప్రెస్ రైలు పిడుగురాళ్లలో నిలిచిపోయింది. అయితే, రైలు పట్టాలు తప్పడానికి గల కారణాలు ఇంకా తెలియరాలేదు. సమాచారం అందుకున్న అధికారులు ఘటనా స్థలానికి చేరుకొని విచారణ జరుపుతున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్