హెచ్సీయూ ఉదంతాన్ని రాష్ట్ర ప్రభుత్వం గుణపాఠంగా తీసుకోవాలని బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ పేర్కొన్నారు. HCU వ్యవహారంలో కాంగ్రెస్ సర్కార్ వైఖరి సరైంది కాదని కేసీఆర్ అన్నారు. "BRS ప్రభుత్వం తెలంగాణను దేశంలోనే అగ్రగామిగా తీర్చిదిద్దితే నిలబెట్టుకోవడం ఈ ప్రభుత్వానికి చేతకాలేదు. హెచ్సీయూ విషయంలో మరోసారి రాష్ట్ర ప్రతిష్ఠను కాంగ్రెస్ సర్కార్ దిగజార్చింది." అని కేసీఆర్ విమర్శించారు.