అక్రమ మనీ గేమింగ్ వెబ్సైట్లపై డీజీజీఐ కొరడా ఝుళిపించింది. 357 వెబ్సైట్లను బ్లాక్ చేశారు. దీంతో పాటు ఆన్లైన్ మనీ గేమింగ్ సంస్థలకు చెందిన 2400 బ్యాంక్ ఖాతాలు సీజ్ చేసింది. ఆయా సంస్థలకు చెందిన రూ.126 కోట్లు ఫ్రీజ్ చేసింది. ఆన్లైన్ మనీ గేమింగ్ ఫ్లాట్ఫామ్ల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది.