ఒక వేళ మహేంద్ర సింగ్ ధోనీకి ఇదే చివరి ఐపీఎల్ సీజన్ అయితే చెన్నై సూపర్ కింగ్స్ ఆటగాళ్లంతా కలిసి టైటిల్ సాధించేందుకు కృషి చేయాలని భారత మాజీ ప్లేయర్ ఆకాశ్ చోప్రా పేర్కొన్నారు. ఐపీఎల్ 2025 ట్రోఫీతో ధోనీకి ఘనమైన వీడ్కోలు ఇవ్వాలని CSK టీమ్కు ఆకాశ్ చోప్రా సూచన చేశారు. ఐపీఎల్ 2025 సీజన్లో రుతురాజ్ గైక్వాడ్కు ఇదో అద్భుత అవకాశం అని చోప్రా వెల్లడించారు.