అమిత్ కటారియా భారతదేశంలోని అత్యంత ధనిక బ్యూరోక్రాట్లలో ఒకరు. 1 రూపాయి జీతం తీసుకునే IAS అధికారిగా ప్రసిద్ధి చెందాడు. అతని కుటుంబం గుర్గావ్లో నిర్మాణ కంపెనీలను కలిగి ఉంది. అతని భార్య బాగా సంపాదిస్తున్న ఒక ప్రొఫెషనల్ పైలట్. వ్యవస్థలో మార్పు తీసుకురావడానికి ఐఏఎస్లో చేరానని, సంపాదించేందుకు కాదని చెప్పాడు. అతికొద్ది మంది నిజాయితీ గల అధికారులలో ఆయన ఒకరు. ఈయన ఆస్తుల విలువ రూ. 8.80 కోట్లు.