బ్రిటీష్ కాలంలో నిర్మించిన పాంబన్ వంతెన శిథిలావస్థకు చేరుకోగా భారతీయ రైల్వే కొత్త వంతెన నిర్మించింది. శ్రీరామనవమి సందర్భంగా ఈ వంతెనను ప్రధాని మోదీ ఆదివారం జాతికి అంకితం చేయనున్నారు. రూ.550 కోట్లతో ఈ వంతెన నిర్మాణం చేపట్టారు. ఈ బ్రిడ్జిలోని వర్టికల్ లిఫ్టును ఒక్క బోల్టు కూడా వాడకుండా వెల్డింగ్తోనే నిర్మించారు. ఈ వంతెన వందేళ్ల వరకు పటిష్టంగా ఉంటుంది. గరిష్టంగా గంటకు 80 కి.మీ వేగంతో రైళ్లు వెళ్లొచ్చు.