ఏపీ వ్యాప్తంగా నేడు శ్రీరామ నవమి వేడుకలు భక్తి శ్రద్ధలతో నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఆంధ్ర భధ్రాద్రిగా పేరొందిన కడప జిల్లాలోని ఒంటిమిట్ట కోదండరామ స్వామి బ్రహ్మోత్సవాలు ఈరోజు ప్రారంభం అయ్యాయి. ఈ నెల 15 వరకు ఈ బ్రహ్మోత్సవాలు జరగనున్నాయి. 11న సీతారాముల కల్యాణోత్సవం జరుగుతుంది. ఈ వేడుకకు సీఎం చంద్రబాబు ఆజరై పట్టువస్త్రాలు సమర్పించనున్నారు. శ్రీరామ నవమి సందర్భంగా సీఎం చంద్రబాబు ప్రజలందరికీ శుభాకాంక్షలు తెలియజేశారు.