శనివారం విడుదలైన ఎగ్జిట్ పోల్స్పై
కాంగ్రెస్ అగ్ర నాయకురాలు సోనియాగాంధీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఎగ్జిట్ పోల్స్ ఇచ్చిన అంచనాలకు ఎన్నికల
ఫలితాలు విరుద్ధంగా ఉంటాయని ఆశాభావం వ్యక్తంచేశారు. అందుకోసం జూన్ 4 వరకు వేచిచూద్దామంటూ మీడియాతో మాట్లాడారు. ‘‘
ఇండియా కూటమి కార్యకర్తల స్థైర్యాన్ని దెబ్బతీసేందుకు బోగస్ పోల్స్ను
మోదీ ప్రచారంలోకి తెచ్చారు. ఇవి ఆయన ఊహల
ఫలితాలు. మాకు 295 సీట్లు వస్తాయి’’ అని అన్నారు.