విజయోత్సవ ర్యాలీలు నిర్వహించొద్దు: సీఈవో

84చూసినవారు
విజయోత్సవ ర్యాలీలు నిర్వహించొద్దు: సీఈవో
ఓట్ల లెక్కింపు సమయంలో ఎవరైనా కౌంటింగ్‌ కేంద్రంలో అలజడి సృష్టిస్తే తక్షణమే వారిని అరెస్టు చేస్తామని ఏపీ రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి(సీఈవో) ముకేశ్‌ కుమార్‌ మీనా హెచ్చరించారు. రాజకీయ పార్టీల అభ్యర్థులు, కౌంటింగ్‌ ఏజెంట్లు ఈ విషయాన్ని గమనించాలని సూచించారు. కౌంటింగ్ కేంద్రం వద్ద 144 సెక్షన్ అమల్లో ఉంటుందని, సీఆర్‌పీఎఫ్‌ దళాలు భద్రతను పర్యవేక్షిస్తుంటాయని చెప్పారు. ఫలితాల తర్వాత విజయోత్సవ ర్యాలీలు నిర్వహించకూడదని స్పష్టం చేశారు.

సంబంధిత పోస్ట్