ఎన్నికల ప్రచారంలో వివేకా హత్య గురించి మాట్లాడొద్దు

55చూసినవారు
ఎన్నికల ప్రచారంలో వివేకా హత్య గురించి మాట్లాడొద్దు
కడప జిల్లాలో వైఎస్ షర్మిల ఎన్నికల ప్రచారంలో పదేపదే వైఎస్ వివేకానంద రెడ్డిని హత్య చేయించింది అవినాష్ రెడ్డే అని ఆరోపిస్తున్నారు. ఆ ప్రచారానికి అడ్డుకట్ట వేయించడానికి వైసీపీకి చెందిన కడప మేయర్ సురేష్‌బాబు జిల్లా కోర్టులో మధ్యంతర ఉత్తర్వులు తెచ్చుకున్నారు. వివేకా హత్య ప్రస్తావన ఎత్తకూడదని కోర్టు షర్మిల, సునీతలతో పాటు ప్రతిపక్షనేతలను ఆదేశించింది. అయితే ఆ ఉత్తర్వులపై సునీత హైకోర్టును ఆశ్రయిస్తానంటున్నారు.

సంబంధిత పోస్ట్