జార్ఖండ్ మాజీ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్కు రాంచీ ప్రత్యేక కోర్టులో చుక్కెదురైంది. భూ కుంభకోణం కేసులో అరెస్టయ్యి జైల్లో ఉన్న ఆయనకు తాత్కాలిక బెయిల్ మంజూరు చేసేందుకు కోర్టు నిరాకరించింది. హేమంత్ సోరెన్.. తన మామ అంత్యక్రియల్లో పాల్గొనేందుకు 13 రోజులపాటు మధ్యంతర బెయిల్ మంజూరు చేయాలని అభ్యర్థిస్తూ రాంచి కోర్టులో పిటిషన్ వేశారు. ఈ పిటిషన్పై విచారణ జరిపిన న్యాయస్థానం బెయిల్ మంజూరు చేయడం కుదరదని స్పష్టం చేసింది.