బడికి డుమ్మా కుదరదిక

77చూసినవారు
బడికి డుమ్మా కుదరదిక
బడులకు గైర్హాజరవుతున్న టీచర్లను గాడినపెట్టేందుకు పాఠశాల విద్యాశాఖ సరికొత్త అస్త్రాన్ని సంధిస్తున్నది. టీచర్లకు ఫేషియల్‌ రికగ్నిషన్‌ అటెండెన్స్‌ (ఎఫ్‌ఆర్‌ఎస్‌)ను అమలు చేయనున్నది. స్మార్ట్‌ఫోన్‌, ట్యాబ్‌లలో యాప్‌ ను ఇన్‌స్టాల్‌ చేసి, కెమెరా ఆధారంగా స్కాన్‌ చేయగానే హాజరు నమోదు చేయడం దీని ప్రత్యేకత. గతంలో టీచర్లకు నిరుడు 19,200 ట్యాబ్‌లను పంపిణీ చేశారు. ఇటీవలే 4జీ జియో సిమ్‌కార్డులను కూడా అందజేశారు.

సంబంధిత పోస్ట్