మయన్మార్లో తీవ్ర భూకంపం కలకలం రేపుతోంది. మాండలే అంతర్జాతీయ విమానాశ్రయంలో, ప్రయాణికులు భూకంపం సమయంలో భూమిపై కూర్చొని రక్షణ పొందేందుకు ప్రయత్నిస్తున్న వీడియోలు బయటకొచ్చాయి. అందులో విమానం, ఎయిర్పోర్ట్ ఊగిపోతున్నట్టుగా కనిపించాయి. బోర్డింగ్కి ముందే ముందు భూకంపం రావడంతో తీవ్ర భయాందోళన నెలకొంది. ప్రాణాలు అరచేతిలో పట్టుకొని ప్రయాణికులు అక్కడే కూర్చున్నారు.